సీబీఐ నుంచి ప్రాణహాని

సీబీఐ నుంచి ప్రాణహాని

అనంతపురం: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అనుచరులు, సీబీఐ, సీఐ శ్రీరామ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని సోమవారం గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేసారు. ‘నాకు రక్షణ కల్పించాలి. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారు. రూ.10కోట్ల ఇస్తామని సీబీఐ ఆశ చూపింది. వివేకానంద హత్య కేసులో వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ ఒత్తిళ్లకు గురిచేస్తోంది. నేనే చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికా రు లు బెదిరిస్తున్నారు. వివేకా హత్య కేసులో నాకు ఎటువంటి సంబంధం లేద’ని ఆందులో పేర్కొన్నాడని . ఫక్కీరప్ప వివరించారు. డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపి స్తామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos