హైదరాబాద్: కాంగ్రెస్
పార్టీ లోక్సభ అభ్యర్థుల ప్రకటన ఈ నెలాఖరులో ఉంటుందని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆశావహుల
నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ
చెప్పారు. అభ్యర్థుల ప్రకటన నాటికి పొత్తుల మీద కూడా ఒక స్పష్టత వస్తుందని
తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామన్న ఎంపీ కవిత మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందుతున్నా మాట్లాడే మంత్రి కూడా లేరని
ఆవేదన వ్యక్తం చేశారు.