త్వరలోన్యూ ఢిల్లీ – లండన్ బస్సు

త్వరలోన్యూ ఢిల్లీ – లండన్ బస్సు

న్యూ ఢిల్లీ : ఆశ్చర్య పడుతున్నారా? పడండి. ఇది మాత్రం నిజం. ఢిల్లీ నుంచి బయలు దేరనున్న బస్సు ఒకటి 18 దేశాల ద్వారా 70 రోజుల పాటు 20 వేల కి.మీలు ప్రయాణించి బ్రిటన్ రాజధాని లండన్ చేరనుంది. తిరిగి అదే మార్గంలో ఢిల్లీకి రానుంది. ప్రయాణం పేరు – బస్ టు లండన్. దీన్ని ఒక సాహస యాత్ర అన వచ్చు. గురుగ్రామ్కు చెందిన అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్ సంస్థ బస్ యాత్రకు శ్రీకారం చుట్టింది. టికెట్ ధర రూ. 15 లక్షలు. మయన్మార్, థాయ్లాండ్, లావోస్, చైనా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల ద్వారా బస్సు గమ్య స్థానాన్ని చేరనుంది. 20 మంది మాత్రమే ప్రయాణించే వీలుంది. ఇద్దరు డ్రైవర్లు, ఒక గైడ్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రయాణికుల వీసా, భోజన, వసతి సదుపాయాల నుంచి అన్నింటినీ ట్రావెల్ సంస్థే చూసుకుంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos