అయోధ్య ఓ బౌద్ధ క్షేత్రం

అయోధ్య ఓ బౌద్ధ క్షేత్రం

అయోధ్య : రామ జన్మభూమి ప్రాంతం పురాతన బౌద్ధ క్షేత్రంగా తేలినందున రామాలయ నిర్మాణాన్ని ఆపేయాలని బౌద్ధ సన్యాసులు అయోధ్య జిల్లాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేసారు. అక్కడ యునెస్కో ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరపాలని డిమాండ్ చేశారు. రామ మందిరం కోసం భూమిని చదును చేస్తున్నపుడు బయల్పడిన వస్తువులను ప్రజలకు ప్రదర్శించాలని కోరారు. రామాలయ నిర్మాణం కోసం భూమి చదును చేసినపుడు ఒక శివ లింగం, ఏడు నల్ల స్తంభాలు, ఆరు ఎర్ర స్తంభాలు, పూల శిఖరం, నాలుగు విగ్రహాలు బయట పడ్డాయి. ‘అవన్నీబౌద్ధ సంస్కృతికి చెందినవి. ఆలయ నిర్మాణం ఆపాలి.రామ మందిర నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలి. అయోధ్య పురాతన కాలంలో బౌద్ధమతానికి కేంద్రంగా ఉన్న సాకేత్ నగరం. రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర ప్రభుత్వ సంస్థలకు అయోధ్య పరిపాలన విభాగం ద్వారా మా వినతి పత్రాలను పంపాం. నెల రోజుల్లోపు రామ మందిర నిర్మాణం నిలిపివేసి ఆ ప్రాంతాన్ని యునెస్కోకు అప్పగించకపోతే మళ్లీ మా ఉద్యమాన్ని ప్రారంభిస్తామ’ని ఆజాద్ బౌద్ధ ధర్మ సేనా ప్రకటించింది. బౌద్ధ మత నాయకుల నుంచి వినతి పత్రం తమకు అందినట్లు ఫైజా బాద్ నగర మెజిస్ట్రేట్ ఎస్పీ సింగ్ తెలిపారు. సంబంధిత వ్యక్తులకు వాటిని అందిస్తామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos