పని చేయకపోతే ఇంటికి పంపిస్తాం

పని చేయకపోతే ఇంటికి పంపిస్తాం

న్యూ ఢిల్లీ : ‘‘ఆశించిన మేర మీరు పనిచేయాలి. లేదంటే ఇంటి ముఖం పట్టాల్సిందే. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక మీదట ఇది ఒక సాధారణ నియమం. పని చేయడమా లేదంటే వెళ్లిపోవడమా’’ అని మంత్రి అశ్వని వైష్ణవ్ బీఎస్ఎన్ఎల్ ఉన్నత ఉద్యోగులకు తేల్చి చెప్పారు. ఎంతో పోటీతత్వంతో పనిచేయాలని సూచించారు. టాప్ ప్రైవేటు కంపెనీలతో పోటి పడాల్సి ఉంటుందన్నారు. ‘‘పనిచేయడం ఇష్టం లేని వారు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకుని ఇంటికి పోవడమే. వారు వీఆర్ఎస్ తీసుకోవడానికి ముందుకు రాకపోతే మేమే 56జే నిబంధన వాడతాం’’ అని హెచ్చరించారు. బీఎస్ఎన్ఎల్ ఎక్చేంజ్ లు, కార్యాలయాల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని కూడా ప్రస్తావించారు. మెరుగ్గా పని చేయకపోతే ఉన్నతోద్యోగులను సైతం తొలగిస్తామని, ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామని వారికి మంత్రి తేల్చి చెప్పారు. సర్కారీ మనస్తత్వాన్ని వదులుకోవాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ.1.64 లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని చేయటం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos