చంద్ర చూడేశ్వర స్వామి గర్భగుడికి ఇత్తడి తాపడం : మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్ దాతృత్వం

చంద్ర చూడేశ్వర స్వామి గర్భగుడికి ఇత్తడి తాపడం : మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్ దాతృత్వం

హొసూరు : ఇక్కడి తేరుపేటలో కొండపైన వెలసిన మరకత చంద్ర చూడేశ్వర స్వామి ఆలయ గర్భగుడి మూల స్తంభాలకు ఇత్తడి తాపడం చేయనున్నారు. ఈ ఆలయాన్ని హొయ్సళ  రాజుల కాలంలో నిర్మించారు. తరువాత శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆలయ గర్భగుడిలోని నాలుగు మూల స్తంభాలకు రూ.ఆరు లక్షల ఖర్చుతో ఇత్తడి తాపడం చేయడానికి మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్ ముందుకు వచ్చారు. రాష్ట్రంలోని కుంభకోణానికి చెందిన కళాకారులతో 140 కేజీల ఇత్తడి రేకును మూల స్తంభాలకు తాపడం చేయనున్నట్లు మనోహరన్ తెలిపారు. బుధవారం పనులు ప్రారంభమయ్యాయి. రెండు నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తారని మనోహరన్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos