అమ్మాయిల హాస్టల్‌ గదిలో రాతంత్రా ఓ అబ్బాయి..

అమ్మాయిల హాస్టల్‌ గదిలో రాతంత్రా ఓ అబ్బాయి..

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు ట్రిపుల్ ఐటీలోని లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించిన అబ్బాయి రాతంత్రా గడిపిన ఘటన ఇంకా మరవకముందే అచ్చం అటువంటిదే తెలంగాణలోనూ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని లేడీస్ హాస్టల్లోకి నెల 17 మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో యువకుడు చొరబడ్డాడు. స్నేహితురాలి గదిలో రాత్రంతా గడిపాడు. వారు ఇద్దరూ కుమురం భీం జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారని, వారి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. దీంతో ప్రియురాలిని చూసేందుకు ప్రహరీ దూకి, వెంటిలేటర్ గుండా లోపలికి ప్రవేశించాడు.ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయి గదిలో మరో ముగ్గురు ఉన్నప్పటికీ విషయం వెలుగులోకి రాలేదు. మరుసటి రోజు గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది అబ్బాయిని గమనించి ప్రిన్సిపాల్కు సమాచారం అందించారు. దీంతో ఆయన ఎంఈవో దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి అబ్బాయి, అమ్మాయిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు. కాగా, వీరికి సహకరించిన మరో ముగ్గురిని కూడా కాలేజీ నుంచి సస్పెండ్ చేసి, వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos