శ్రీనగర్ :. ఉత్తర కాశ్మీర్లోని నౌగమ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఒసి) వెంబడి పాకిస్తాన్ సైన్యం మంగళవారం ఉదయం మోర్టార్స్, ఇతర ఆయుధాలతో కాల్పులు ప్రారంభించిందని సైనికాధికారులు తెలిపారు. పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కాల్పులు, ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని అన్నారు.