జోద్పూర్: ‘తక్షణ న్యాయం అనేది సాధ్యపడదు. ఒకవేళ అది ప్రతీకారంగా మారితే న్యాయం తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది’ అని అత్యున్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమమూర్తి బొబ్డే వ్యాఖ్యానించారు. రాజస్థాన్ ఉన్నత న్యాయస్థానం నూతన భవంతి ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థలో కొత్త సాంకేతిక ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలైన మధ్యవర్తిత్వం వంటివి బలోపేతం చేసినపుడు వ్యాజ్యాల పరిష్కారం వ్యవధి తగ్గుతుందని చెప్పారు. హైదరాబాద్ దిశ హత్యోదంతంలో నలుగురు నిందితులు పోలీసు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.