29 ఏళ్ల పంతానికి తెర.. రెండు వర్గాలను కలిపిన రాహుల్ గాంధీ

29 ఏళ్ల పంతానికి తెర.. రెండు వర్గాలను కలిపిన రాహుల్ గాంధీ

బదనవాళు: భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బదనవాళు గ్రామంలో సామాజిక వర్గ విభేదాల కారణంగా విడిపోయిన రెండు వర్గాలనూ ఆదివారం సహపంక్తి భోజనాలతో కలిపారు. రాహుల్ గాంధీతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రణ్దీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ గ్రామస్థులతో కలిసి భోజనం చేశారు. రెండు వర్గాలను కలపడానికే ఈ భోజనాలు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. దీంతో 29 ఏళ్ల తర్వాత ఆ వర్గాల ప్రజలు ఒక్కటయ్యారని చెప్పింది.1993లో జరిగిన గొడవల తర్వాత రెండు వర్గాలు నివసించే ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమదానం చేసి.. రోడ్డును పునరుద్ధరించారు. దీనికి భారత్ జోడో రోడ్డు అని పేరు పెట్టారు. “దాదాపు 30 ఏళ్ల క్రితం వర్గ విభేదాల కారణంగా బడనవాలు అనే గ్రామంలో నరమేధం జరిగింది. ఇప్పటి వరకూ ఆ వర్గాల మధ్య ఆ దూరం అలానే ఉంది. కానీ ఇప్పుడు ఆ రెండు వర్గాలతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. విరిగి పోయిన వారి మనసులను తిరిగి రాజీ పడేలా చేశారు. ఇది భారత్ జోడో యాత్ర విజయం” అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘గ్రామంలోని ప్రజల మనసులు కలపడానికి రాహుల్ గాంధీ పాత ఇళ్లకు రంగులేసి శ్రమ ధానం చేశారు’ అని కెపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos