అంగన్‌ వాడీల ‘ఆహారం’ అధికార్ల జేబుల్లోకి

అంగన్‌ వాడీల ‘ఆహారం’ అధికార్ల జేబుల్లోకి

ప్రజావాహిని  – బెంగళూరు

బంగారుపేట తాలూకాలోని 255 అంగన్‌వాడీల అధికార్లు వాటి పరిధుల్లోని బాలలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని వితరణ చేయకుండా నకిలీ బిల్లుల్ని సృష్టించి నిధుల్ని స్వాహా చేసారని శాసనసభ్యుడు నారాయణ స్వామి శుక్ర వారం విధానసభలో ఆరోపించారు. దీని గురించి ఉన్నతాధికార్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని  ఆక్రోశించారు. మంత్రి  హాలప్ప ఆచార్‌ తరఫున బదులిచ్చిన  మరో మంత్రి గోవింద కార్జోళ ఆ ఆరోపణల్ని ఖండించారు. సిబ్బంది అంతర్గత కలహాల వల్ల ఇలాంటి ఆరోపణలు వచ్చాని ఉన్నతాధికార్ల విచారణలో తేలిందన్నారు. నిధులు దుర్వినియోగమయ్యా యనేందుకు తగిన సాక్షాధారాల్ని చూపిస్తే తగిన చర్యల్ని తీసుకుంటామని కార్జోళ మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos