రాజవొమ్మంగి :మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర(111) ఆదివారం తన నివాసంలో మరణించారు. 1924 మే లో కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్ వారిపై చివరి పోరాటం చేశారు. అప్పట్లో ఎత్తయిన కొండలపై బస చేసిన అల్లూరి సీతారామరాజుకు బాలుడిగా ఉన్న బాలుదొర అల్లూరికి ఆహార పదార్థాలు అందించారు. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిదంటూ నాటి జ్ఞాపకాలను బాలుదొర స్థానికులతో ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు. వయసు మీద పడడంతో ఇటీవల మంచం పట్టిన ఆయన ఆదివారం కన్నుమూశారు.