కరోనాపై పోరు చేయాలంటే ఇవి తినాల్సిందే..

కరోనాపై పోరు చేయాలంటే ఇవి తినాల్సిందే..

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తీరు చూస్తుంటే ఎప్పుడు, ఎవరికి, ఎవరి నుంచి, ఎలా సోకుతుందో చెప్పలేని పరిస్థితి. సమయంలో శరీరాన్ని కరోనా వైరస్ సోకినా, దానిపై పోరాడ గలిగేంత బలంగా తయారు చేసుకోవాలని, అందుకు సమతుల ఆహారాన్ని తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ఏకైక మార్గం.కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), ఎన్ఐఎన్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) నిపుణుల సూచనల ప్రకారం విటమిన్స్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, వివిధ రకాల పిండి పదార్థాలు, నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, ఏవైనా ఇన్ఫెక్షన్లు ఇతరుల నుంచి సోకితే కాపాడుకునే శక్తి అధికమవుతుంది.న్యూట్రిషన్ రీసెర్చ్‌పై శతాబ్దానికి పైగా చరిత్రను కలిగిన ఎన్ఐఎన్, కరోనా వైరస్‌పై పోరాడేందుకు శరీరాన్ని సిద్ధం చేసుకునే క్రమంలో భాగంగా చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన ఆహారంపై కొన్ని సూచనలు.

మైక్రో న్యూట్రియంట్స్ (విటమిన్స్ మరియు మినరల్స్) అధికంగా తీసుకోవడం ద్వారా, ఒకే రకమైన వ్యాధి కారకాల నుంచి రీ ఇన్ఫెక్షన్ సోకడాన్ని నివారించవచ్చు. శరీరంలో విషపూరిత టాక్సిన్ లను తొలగించే శక్తిని కూడగట్టుకోవచ్చు. ఇదే సమయంలో వైరస్ ను హతమార్చేందుకు సహకరించే ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను అధికంగా శరీరం ఉత్పత్తి చేసుకుంటుంది.బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడి, నారింజ, నిమ్మకాయలు, బెర్రీ తదితర సీజనల్ ఫ్రూట్స్ తో పాటు ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, తాజా మాంసం, చేపలు తదితరాల్లో న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది, చెడు బ్యాక్టీరియాను అంతమొందిస్తూ, రోగ నిరోధక శక్తి హరించబడకుండా అది కాపాడుతుంది.ఈ సమయంలో ప్రాసెస్డ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్, కార్బొనేటెడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండటమే మంచిది.అదేవిధంగా మాంసం, గుడ్లు తినడం కూడా వైరస్‌పై పోరాటానికి సహకరిస్తుంది. అయితే, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా మాంసం, గుడ్లు,  కూరగాయలను శుభ్రంగా కడిగిన తరువాతనే వినియోగించాలి.ఇక కొవ్వు పదార్థాలను రోజుకు 30 గ్రాముల కన్నా అధికంగా తీసుకోకుండా ఉంటే మంచిది, ఉప్పును కూడా రోజుకు 5 గ్రాములకు పరిమితం చేయాలని, పంచదారను తీసుకోవడాన్ని కూడా నియంత్రించుకోవాలి. శరీరానికి కావాల్సినంత నీటిని అందించడం ద్వారా డీ హైడ్రేషన్ ను నివారించవచ్చని, నిత్యమూ యోగాను దినచర్యలో భాగం చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.మంచి అలవాట్లతోనే చాలా వరకూ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు, రోజువారీ మందులను తీసుకుంటూనే డైట్ ను కొనసాగిస్తూ, వ్యాయామం తదితరాల ద్వారా ఒత్తిడికి దూరంగా ఉంటూ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos