పీసీఏ చీఫ్ గుల్జారీందర్ చాహల్ పై భజ్జీ మండిపాటు

పీసీఏ చీఫ్ గుల్జారీందర్ చాహల్ పై భజ్జీ మండిపాటు

న్యూ ఢిల్లీ: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జారీందర్ చాహల్ పై టీమిండియా మాజీ ఆటగాడు, ఆప్ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ మండి పడ్డారు. అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడితే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అక్రమాలకు సంబం ధించి గత వారం, పది రోజులుగా పంజాబ్ క్రికెట్ అభిమా నులు, స్టేక్ హోల్డర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవ డానికి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ యత్నిస్తోందని… ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. అంతేకాదు… పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మార్గదర్శ కాలు, పారదర్శకత ఉల్లంఘన కిందకు కూడా ఇది వస్తుందని చెప్పారు. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos