అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్‌ బుకింగ్‌

అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్‌ బుకింగ్‌

తిరువనంత పురం: శబరిమల యాత్ర కోసం పేర్లను ముందుగా నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం ఆసక్తి కలిగిన వారు www.sabarimalaonline.orgలో లాగిన్ అయి వారి పేరు, వయసు, చిరునామా, ఫొటో, స్కాన్ చేసిన గుర్తింపు కార్డులు, మొబైల్ నెంబర్ వివరాలు పంపాలి. ఎవరికి వారు విడిగా బుకింగ్ చేసుకోవాలి. ఐదేళ్లలోపు పిల్లలకు మినహాయింపు. బడి పిల్లలు గుర్తింపు పత్రాన్ని జత చేసి నమో దు  చేసు కోవాలి. బుకింగ్ తర్వాత యాత్ర సమయం, తేదీని సేవ్ చేసి దర్శన పత్రం ప్రింట్ తీసుకోవాలి. యాత్రకు వెళ్లేట ప్పుడు దీనితో బాటు పాటు ఫొటో గుర్తింపు పత్రాన్ని తీసుకెళ్లాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos