రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలు

హొసూరు : ఇక్కడికి సమీపంలో టెంపో ట్రావెలర్, లారీని ఢీ కొన్న ప్రమాదంలో ఏడు మంది అయ్యప్ప స్వామి భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం వేకు వజామున బెంగళూరు మాగడి రోడ్డు కు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమలై నుంచి తిరిగి వస్తుండగా, పేరంట పల్లి వద్ద జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్‌ అదుపు తప్పి ముందు వెళుతున్న లారీని ఢీకొంది. గాయపడిన అయ్యప్ప భక్తులను స్థానికులు  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  టెంపో ట్రావెలర్  డ్రైవర్ అజాగ్రత్త వల్ల ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos