అమరావతి: ఆనందయ్య ఆయుర్వేద మందు పై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. నెల్లూరుకు వైద్యులు, శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలని సూచించారు. కరోనా నియంత్రణ, టీకాల గురించి ఆయన సమీక్షించారు.