వారు సామాన్యులు కాబట్టి కాల్చేసారు

వారు సామాన్యులు కాబట్టి కాల్చేసారు

విజయవాడ: ‘దిశపై అఘాయిత్యానికి పాల్పడి, హతం చేసిన వారు సామాన్యులు. ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టి ఈతేలిగ్గా వారిని కాల్చి చంపేశారు. అదే నా కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు న్యాయం జరగడం లేద’ని పన్నెండే ళ్ల కిందట అత్యాచారానికి, హత్యకు గురైన అయేషా మీరా తల్లి శంషాద్ బేగం శుక్రవారం ఇక్కడ ప్రశ్నించారు. ‘దిశ తల్లిదం డ్రుల కు న్యాయం జరిగినందున వారు సంతోషించవచ్చు. నాలాంటి వారి పరిస్థితి ఏమిట’ ని ప్రశ్నించారు. పందొమ్మిదేళ్ల ఫార్మసీ విద్యా ర్థిని అయేషా మీరాను గుర్తు తెలియని వ్యక్తులు 2007, డిసెంబరు 27న విజయవాడలోని ఆమె నివాసం ఉంటు న్న హాస్టల్ లోనే అత్యాచారం చేసి హత్య చేశారు. బాత్ రూంలో మృతదేహం పడివుండగా, ‘తన ప్రేమను తిరస్కరించినందుకే ఆమెపై అత్యా చారంచేసి చంపేశాను’ అని నిందితుడు లేఖ రాసి మరీ ఆమె పక్కన పడేశాడు. తన కుమార్తెకు ఇంత అన్యా యం జరిగినా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని, కుమార్తె ఆత్మశాంతించలేదని అయేషా తల్లి వాపోయారు. సజ్జనార్ లాంటి పోలీసు అధికారి తమ కుమార్తె కేసు దర్యాప్తు చేసి ఉంటే తమకు న్యాయం జరిగి ఉండేదేమోనని ఆమె ఆశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos