న్యూఢిల్లీ: అమ్మకాలు తగ్గటంతో కాస్త దిగొచ్చిన బంగారం ధర బుధవారం రూ. 332 పెరిగింది. రాజధానిలో 10 గ్రాముల పసిడి ధర రూ. 39,299లు పలికింది. వెండి ధర కూడా వేడెక్కింది. బుధవారం ఒక్కరోజే కేజీ వెండి ధర రూ. 46,672కు చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ ఆందోళనలు, ఆర్థిక మందగమనాల వల్ల పసిడి కొనుగోలు శ్రేయస్కరమని మదుపర్లు భావించటమే దాని డిమాండు పెరగటనికి ప్రధాన కారణం. దీనికి తోడు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా క్షీణిస్తోంది.