పెరోల్‌ పై వచ్చి ప్రమాణం

పెరోల్‌ పై వచ్చి  ప్రమాణం

లఖ్నవూ: ఎన్నికల్లో గెలిచి ఎనిమిది నెలలైనా లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసే అవకాశం ఎట్టకేలకు బీఎస్పీకి చెందిన అతుల్ రాయ్కు ఇప్పుడు లభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోసీ లోక్సభ నియోజక వర్గం నుంచి గెలిచారు. అత్యా చారం కేసులో అరెస్టైన ఆయన నిరుటి మే నుంచి చెరసాల్లో బంధీగా ఉన్నారు. లోక్ సభ సభ్యుడుగా ప్రమాణాన్ని చేయడానికి అనుమతించాలని ఆయన చేసిన వినతుల్ని న్యాయస్థానం తిరస్కరించింది. అయితే అలహాబాద్ ఉన్నత న్యా య స్థానం ఇటీ వల ఆయనకు రెండు రోజుల పెరోల్ మంజూరు చేసింది. పోలీసుల పహరాలో జనవరి 29న దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రమా ణాన్ని చేసిన తర్వాత 31న తిరిగి రావాలని జస్టిస్ రమేశ్సిన్హా ఆదేశించారు. తనను రాజకీయ ప్రత్యర్థులు అత్యాచార కేసులో ఇరికించారని అతుల్ రాయ్ ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos