కమలం కచ్చేరీ పై కార్యకర్తల దాడి

కమలం కచ్చేరీ పై కార్యకర్తల దాడి

హైదరాబాద్: కూకట్పల్లిలో భాజపా కార్యాలయాన్ని బాలానగర్కు చెందిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ధ్వంసం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల టిక్కెట్లు అమ్ముకున్నారని ఆగ్రహించిన కార్యకర్తలు చర్యకు పాల్పడ్డారు. ఇప్పటివరకూ పార్టీలో పని చేస్తున్న వారిని కాదని, వేరే వాళ్లకు టిక్కెట్లు ఇచ్చినందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకు న్నందుకు ఇదేనా బహుమానం అంటూ ఆగ్రహించారు. దీనిపై వెంటనే పార్టీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos