అనంతపురం: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాల కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.అయితే సమావేశం జరుగుతుండగానే జిల్లా రెవెన్యూ అధికారి మలోలా ఆన్లైన్లో రమ్మీ గేమ్ ఆడుతూ వీడియో కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్ డీఆర్వోపై సీరియస్ అయ్యారు. అతడిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.