భాజపా ఎత్తు చిత్తు

భాజపా ఎత్తు చిత్తు

జైపూర్: కాంగ్రెస్ పార్టీలోలో సోదరభావం కొనసాగుతూనే ఉంటుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. తమ శాసనసభ్యులంతా కలిసే ఉన్నారన్నారు. ప్రభుత్వ విభాగాలను భాజపా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. భాజపా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలిన తమ ఎమ్మెల్యేలంతా కలసి కట్టుగా విఫలం చేసారని వ్యాఖ్యానించారు. ‘ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ విడిచి వెళ్లలేదు. కాంగ్రెస్ పార్టీలో సోదరభావం ఇలాగే కొనసాగుతుంది. అధిష్ఠానం నియమించిన ముగ్గురు సభ్యుల సమితి సమస్యల్ని పరిష్కరిస్తుంద’ని ఆశించారు. ‘కేంద్రం ఆదాయపు పన్ను శాఖ, సీబీఐను దుర్వినియోగం చేస్తోంది. మతం పేరిట రాజకీయాలు సాగిస్తన్నారు. రాజస్థాన్లో మా ప్రభుత్వ మనుగడకు ఢోకా లేదు. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటుంది. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos