అమరావతి:తమ సంస్థకు వ్యతిరేకంగా దురుద్దేశంతో చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పని పక్షంలో చట్ట ప్రకారం చర్యల్ని తీసు కుంటామని ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్ తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు,మాజీమంత్రి నక్కా ఆనంద బాబు, పంచుమర్తి అనురాధలకు బుధవారం తాఖీదుల్ని పంపింది.‘మాకు వ్యతిరేకంగా చేసిన నిందారోపణలు దురుద్దేశ పూరితమైనవి. ఇవి మా సంస్థ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేవి. అందువల్ల క్షమాపణలు చెప్పాలి. లేనిపక్షంలో న్యాయ పరమైన చర్యలకు సిద్ధంగా ఉండా ల’ని అందులో తేల్చి చెప్పింది