ఓటు లేని బాబుకు అక్కడేమి పని?

ఓటు లేని బాబుకు అక్కడేమి పని?

అమరావతి: : తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఆయనకు కుప్పం లోనూ, నారావారిపల్లెలోనూ ఓటు లేదు. కానీ కుప్పం వెళ్లాలని చంద్రబాబు స్పెషల్ ఫ్లయిట్ సిద్ధం చేసుకున్నారని, ఆయన కుప్పం ఎందుకు వెళుతున్నట్టు అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ విలువలను మంటగలుపుతున్నారు. దొంగ ఓట్లు వేయించే సంస్కృతి టీడీపీదే. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంటే, భగ్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కుప్పంలో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేశామ’ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos