టీటీడీ బోర్డు సభ్యుల నియామకం

టీటీడీ బోర్డు సభ్యుల నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 25 మందితో టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేశారు. కొత్త పాలక మండలి సభ్యులుగా ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మేల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, గోర్ల బాబు రావు, మధుసూదన్ యాదవ్‌లకు చోటు దక్కగా.. తెలంగాణ నుంచి రామేశ్వరావు, లక్ష్మీ నారాయణ, పార్థసారధి రెడ్డి, మూరంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యా సాగర్‌కు అవకాశం ఇచ్చారు. తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మేల్యే నంద కుమార్, కన్నయ్య లకు ఛాన్స్ దక్కగా .. కర్నాటక నుంచి శశిధర్, ఎమ్యెల్యే విశ్వనాథ్‌లకు అవకాశం లభించింది. అలాగే మహరాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్‌కు చోటు లభించింది.
మొత్తం సభ్యుల జాబితా.. పోకల అశోక్ కుమార్‌, మల్లాడి కృష్ణారావు, జూపల్లి రామేశ్వరరావు, మారుతి, జీవన్‌ రెడ్డి, పార్థసారథి రెడ్డి, జె. శ్రీనివాసన్, రాజేష్ శర్మ, సౌరభ్, కన్నయ్య, మూసారంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్, నందకుమార్, ఆడిటర్ సనత్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్ కేతన్ దేశాయ్, లక్ష్మీనారాయణ, మిలింద్, శశిధర్, శంకర్, విశ్వనాథ్, మధుసూదన్ యాదవ్, గోర్ల బాబూరావు, కాటసాని రాంభూపాల్ రెడ్డి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos