రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ గెలిచినా.. మనశ్శాంతిని కోల్పోయాడు..

రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ గెలిచినా.. మనశ్శాంతిని కోల్పోయాడు..

తిరువనంత పురం : ఇక్కడి ఆటో డ్రైవర్ అనూప్ రూ.25 కోట్ల విలువైన లాటరీ విజేతగా నిలిచాడు. దాని వెంబడే ఆయన్ను అశాంతి వెంటడుతోంది. పన్ను, ఇతర బకాయిలు అన్ని మినహాయింపులు పోగా రూ. 15 కోట్లు రానున్నాయి. ‘‘ నేను మనశ్శాంతిని కోల్పోయాను. నేను నా సొంత ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నేను మొదటి బహుమతిని గెలుచుకున్నాను. ఈ విషయం తెలిసిన చాలా మంది నా దగ్గరికి వస్తు న్నారు. తమ అవసరాలు తీర్చాలని నన్ను కోరుతున్నారు. ఇలా వచ్చే వారితో నేను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. నేను బహుమతి గెలుచుకునే ముందు వరకు నాకు చాలా మనశ్శాంతిగా ఉన్నాను. కానీ ఇప్పుడు అది లేదు. నేను దానిని గెలవకుంటే ఉంటే బాగుడేందనని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. చాలా మందిలాగే నేను కూడా ఒకటి లేదా రెండు రోజులు అన్ని వార్తల్లో నిలిచినందుకు నిజంగా ఆనందించాను. ఇప్పుడు అదే ఒక ప్రమాదంగా మారింది. ఇప్పుడు ప్రశాంతంగా బయటికి కూడా వెళ్ళ లేను. తమ అవసరాలు తీర్చేందుకు సాయం చేయాలని ప్రజలు నా వెంటే ఉంటున్నారు. ఆ డబ్బును ఏమి చేయాలో నేను ఇంకా నిర్ణయించుకో లేదు. ప్రస్తుతానికైతే ఆ డబ్బు మొత్తానని రెండేళ్ల పాటు బ్యాంకులో వేస్తాను. నిజంగా ఇప్పుడు ఆ డబ్బు నా దగ్గర ఉండకూడదని కోరుకుంటున్నాను. ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఉండే బదులు కొంత తక్కువగానే ఉంటే బాగుండేది అనిపిస్తోంది’’అని అన్నారు. . ‘‘ నన్ను వెతుక్కుంటూ చాలా మంది వస్తున్నారు. మా ఇంటి చుట్టుపక్కలే తిరుగుతున్నారు. దీంతో మా ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది అవుతోంది. దీంతో వారు కూడా ఇప్పుడు నాపై కోపంగా ఉన్నారు. మాస్క్ వేసుకున్నా కూడా నేనే విజేతను అని తెలిసి నా చుట్టూ జనాలు గుమిగూడారు. నా మనశ్శాంతి అంతా పోయింది ’’ అని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos