ఓ అభిమాని ప్రతిభకు,అభిమానానికి భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కొహ్లీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.అస్సాంకు చెందిన రాహుల్ పరెక్ అనే యువకుడు విరాట్ కొహ్లీకి వీరాభిమాని.ఎప్పటినుంచో తన అభిమానాన్ని కొహ్లీకి చూపించాలని తాపత్రయపడుతున్న రాహుల్కు శ్రీలంకతో నేటి నుంచి జరుగనున్న టీ20 సిరీస్ రూపంలో అవకాశం లభించింది.దీంతో పాత మొబైల్ ఫోన్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని రూపొందించి అస్సాంకు వచ్చిన కోహ్లీకి ఈ చిత్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. దీన్ని చూసిన కోహ్లీ అతడి ప్రతిభకు ఆశ్చర్యపోయాడు. దానిపై కోహ్లీ ఆటోగ్రాఫ్ చేస్తుండగా తీసిన ఫొటోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని రూపొందించడానికి తనకు మూడు రోజులు పట్టిందని అభిమాని రాహుల్ పరెక్ చెప్పాడు.’మొబైల్ ఫోన్లు, వైర్లతో నేను ఈ చిత్రాన్ని గీశాను. మూడు రోజులు, మూడు రాత్రుళ్లు కష్టపడి దీన్ని పూర్తి చేశాను. కోహ్లీ సర్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆయన నన్ను కలవడానికి వస్తున్నప్పుడు నా గుండె వేగం పెరిగింది. శ్రీలంకతో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి కోహ్లీ గువాహటికి వస్తున్నాడని నాకు కొన్ని నెలల ముందే తెలిసింది‘అని చెప్పాడు.
Making art out of old phones.
How is this for fan love! 👏👏 #TeamIndia @imVkohli pic.twitter.com/wnOAg3nYGD— BCCI (@BCCI) January 5, 2020