అమరావతి: చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఇన్ఫోటెక్కు కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలను వెనక్కు తీసుకున్నట్లు కున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010లో చిత్తూరు జిల్లా యాదమరి మండలం కొత్తపల్లిలో డిజిటల్ వరల్డ్ సిటి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని అమర్ రాజా ఇన్ఫ్రాటెక్కు ప్రభుత్వం కేటాయించింది. పదేళ్లు దాటినా నిబంధనల ప్రకారం ఉద్యోగాల కల్పన, సంస్థ విస్తరణ లేకపోవడంతో వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.