లక్నో: గూండా వికాస్ దూబే కారు బోల్తా పడలేదు, అతడి రహస్యాల వల్ల ప్రభుత్వమే పడిపోకుండా బయటపడిందని దూబే ఎన్కౌంటర్పై సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ వాస్తవానికి ఆ కారు బోల్తా పడలేదు. రహస్యాలు బయటికి వచ్చి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పడిపోకుండా బయటపడింద’ ని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. వికాస్ దూబేను నిజంగా అరెస్ట్ చేశారో లేక తనంత తాను లొంగిపోయాడో చెప్పాలని అఖిలేశ్ యాదవ్ గురువారం డిమాండ్ చేసారు. అతడితో ఎవరు కుమ్మక్కయ్యారో బయటపడేలా కాల్ రికార్డులన్నీ బహిర్గతం చేయాలని డిమాండ్ చేసారు.