న్యూ ఢిల్లీ : నగర వాసులను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం తెల్లవారు జామున కుండపోతగా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయ మయ్యాయి. 46 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం. రన్వే, టర్మినల్ 3 ప్రాంతాల్లో నీరు నిలిచింది. రానున్న 12 గంటల్లో దిల్లీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశా లు న్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజధానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.