తగ్గేది లేదు

తగ్గేది లేదు

హైదరాబాద్: అగ్నిపథ్ నిరసన జ్వాలలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మండిపోతోంది. ఇంకా రైలు పట్టాలపైనే పైనే వేలాదిమంది ఆందోళనకారులు ఉన్నారు. ఆందోళన విరమించకపోతే.. మళ్లీ కాల్పులు జరుపుతామని రైల్వే పోలీసులు హెచ్చరించినా వెనక్కి తగ్గేది లేదని ఆందోళన కారులు తేల్చి చెప్పారు. శుక్రవారం ఉదయం హఠాత్తుగా మొదలైన అగ్నిపథ్ నిరసనల కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసులు కాల్పులు జరపడంతో వరంగల్కు చెందిన రాకేష్ మృతి చెందాడు. ఖమ్మంకు చెందిన నాగేందర్ బాబు(21), వక్కరి వినయ్(20), కర్నూల్ మంత్రాలయానికి చెందిన రంగస్వామి(20), కరీంనగర్ చింతకుంట గ్రామానికి చెందిన రాకేష్(20), శ్రీకాంత్ (మహబూ బ్నగర్, పాలకొండ విల్), కుమార్(21) వరంగల్, పరశురాం(22) నిజాంసాగర్ కామారెడ్డి జిల్లా గాయ పడ్డారు. రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో వాట్సాప్లో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరీక్షలు రద్దు కావడంతో వాళ్లలో ఆవేశాగ్రహాలు పెల్లుబిక్కాయి. రెండు రోజుల కిందటే.. జిల్లాల నుంచి ఆర్మీ ఉద్యోగాల ఆశావహులు నిరసనలకు పిలుపు ఇచ్చారు. గురువారం రాత్రే సుమారు 500 మంది నిరసనకారులు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. రైళ్లను ఆపేసి ఆందోళన వ్యక్తం చేయాలనుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్కు దిగడంతో విధ్వంసం చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos