మెజారిటీ స్థానాలు సొంతం చేసుకోవాలి : మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి

మెజారిటీ స్థానాలు సొంతం చేసుకోవాలి : మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి

హొసూరు : స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ స్థానాలు ఏడీఎంకే గెలుపొందే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కృష్ణగిరి జిల్లా డెంకణీకోటలో స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలలో వార్డు మెంబర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్మెన్ పదవులను గెలుపొందే విధంగా పార్టీలో ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రజా సంక్షేమ కార్యక్తమాలను చేపట్టి అమలు చేస్తున్నదని, రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి యడపాడి పళని స్వామి పాలనలో మంచి మార్కులు సాధించారని ప్రశంసించారు. స్థానిక సంస్థలే కాక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా ఎడిఎంకే తప్పక విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలంటే బూత్ కమిటీ సభ్యులు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. కృష్ణగిరి జిల్లాలో అన్ని యూనియన్లలో చైర్మన్ పదవులను పార్టీ కైవసం చేసుకోవడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన ఉద్బోధించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజేంద్రన్, పార్టీ నాయకులు నాగేష్, గణేష్, రమేష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos