ఐదు గ్రామాలను దత్తత తీసుకున్న టాలీవుడ్ హీరో..

  • In Film
  • November 18, 2020
  • 180 Views
ఐదు గ్రామాలను దత్తత తీసుకున్న టాలీవుడ్ హీరో..

లాహిరిలాహిరిలాహిరిలో చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆదిత్య ఓం కొద్ది కాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న ఆదిత్య తాజాగా ఐదు గ్రామాలను దత్తత తీసుకోవడం చరచనీయాంశమైంది.తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి పరిసరాల్లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకున్న ఆదిత్య ఐదేళ్లుగా వాటి అభివృద్ధికి పాటుపడుతున్నారు.తన మిత్రుడు, నిర్మాత పీవీఎస్ వర్మతో కలిసి 500 మంది రైతులకు మామిడి, కొబ్బరి విత్తనాలను సరఫరా చేశాడు. గ్రామాల్లోని యువతీయువకులకు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. చేరువల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నారు. చేసింది కొద్ది సినిమాల్లోనే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలే చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యూ వంటి సినిమాల్లో హీరోగా మెప్పించిన ఆదిత్య ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు.పనికిమాలిన ఛాలెంజ్ లు,వంటల వీడియోలు చేస్తూ అదేదో గొప్ప ఘన కార్యం చేస్తున్నట్లు ఫీలైపోతున్న స్టార్ హీరోలు,దర్శకులు,నటీనటులు ఇప్పటికైనా ఆదిత్య ఓం లాగా సమాజం కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos