హైదరాబాద్ : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో హైదరాబాద్కు చెందిన భార్యాభర్తలతో పాటు ఆంధ్రాకు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ గాంధీనగర్కు చెందిన రాజా గవిని(41), దివ్య ఆవుల (34) భార్యాభర్తలు. వీరిద్దరూ టెక్సాస్లోని ఫ్రిస్కోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తమ కుమార్తె రియాను డ్యాన్స్ క్లాస్ వద్ద విడిచిపెట్టారు. తిరిగి వస్తున్న మార్గంలో స్థానికంగా నిర్మాణం చేపట్టిన తమ సొంత ఇంటిని పరిశీలించడానికి విజయవాడ ప్రాంతానికి చెందిన స్నేహితుడు ప్రేమ్నాథ్ రామనాథం (42)ను తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎఫ్ఎం 423 ఇంటర్సెక్షన్ వద్దకు రాగానే ఈ ముగ్గురూ వెళ్తున్న కారును ఓ ట్రక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.