హస్తం నీడకు “కీర్తి”

హస్తం నీడకు “కీర్తి”

మాజీ క్రికెటర్‌, బిహార్‌  లోక్‌సభ సభ్యుడు కీర్తి ఆజాద్‌ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌  పార్టీలో చేరారు. దర్బంగా లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయిన ఆజాద్‌ నిష్క్రమణ కమలనాధులకు పెద్ద పెట్టుగా పరిశీలకు మదింపు. బీజేపీ నాయకత్వంలో విభేదించి ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసినందుకు ఆగ్రహించిన భాజపా నాయకత్వంపై ఆయనపై వేటు వేసింది. దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ ఆయన్ను ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు తెలిసింది. ఆయన సామాజిక వర్గానికి చెందిన పూర్వాంచాలీస్‌ ఓట్లు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణంగా భావిస్తున్నారు.  గతంలో ఆయన ఢిల్లీలో గోలే మార్కెట్‌ విధానసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.   భారత్‌ గెలిచిన 1983 వన్ డే క్రికెట్‌ ప్రపంచకప్‌లో కీర్తి ఆజాద్‌ కూడా సభ్యుడన్న విషయం విధితమే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos