బ్రెగ్జిట్: ప్రధాని థెరెసాకు ఘోర పరాజయం

బ్రెగ్జిట్: ప్రధాని థెరెసాకు ఘోర పరాజయం

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు నిర్దేశించిన నిబంధనలకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని ఎంపీలు 432-202 తేడాతో తిరస్కరించారు.బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే బ్రెగ్జిట్ ఒప్పందం 230 ఓట్ల తేడాతో దారుణంగా ఓటమి పాలైంది. బ్రిటన్ ప్రభుత్వ చరిత్రలోనే ఇది ఘోర పరాజయం.లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అందులో థెరెసాకు మెజారిటీ సభ్యుల మద్దతు లభించకపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.బ్రిటన్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 7 గంటలకు అవిశ్వాస తీర్మానం జరిగే అవకాశం ఉంది.ఈయూతో నిష్క్రమణ ఒప్పందానికి సంబంధించి రెండేళ్ళకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ వచ్చిన థెరెసాకు ఈ ఓటమి తీవ్రమైన ఎదురుదెబ్బ.ఈ ఒప్పంద ప్రతిపాదనలకు కనుక పార్లమెంటు ఆమోదం లభించి ఉంటే ఈయూ నుంచి బ్రిటన్ వచ్చే మార్చి 29 నుంచి సజావుగా నిష్క్రమించే వీలుండేది. ఆ తరువాత ఇరు పక్షాల వాణిజ్య ఒప్పందాల నిర్వహణకు 21 నెలల గడువు అమల్లోకి వచ్చి ఉండేది.మామూలుగా బ్రెగ్జిట్ ఓటింగ్ డిసెంబర్‌లోనే జరగాలి. కానీ, ఎంపీల మద్దతు కూడగట్టుకునేందుకు థెరెసా మరింత సమయం తీసుకున్నారు.ఇప్పటికీ, మార్చి 29 నుంచి ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలనే చూస్తోంది. కానీ, బ్రెగ్జిట్ ఒప్పందానికి మద్దతు కూడగట్టడంలో థెరెసా మే దారుణంగా ఓడిపోవడంతో ఆ ప్రక్రియ ఏ తేదీ నుంచి ఎలాంటి విధి విధానాలతో జరుగుతుందన్నది మళ్ళీ సందేహంలో పడింది. థెరెసా మే ప్రతిపాదించిన ఒప్పందం మరీ కఠినంగా ఉందని భావిస్తున్న ఎంపీలు బ్రెగ్జిట్‌ను పూర్తిగా ఆపేందుకు లేదా ఎలాంటి ఒప్పందం లేకుండా బయట పడేందుకు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పుడు వారు సహజంగానే తమ ప్రయత్నాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. బలహీనపడిన ప్రధాని కూడా ఇప్పుడు వారి వాదన ఏమిటో వినడానికి సుముఖత వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos