పబ్‌జి గేమ్ ప్లేయర్లకు రూ.కోటి నజరానా

పబ్‌జి గేమ్ ప్లేయర్లకు రూ.కోటి నజరానా

దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తోన్న టెన్‌సెంట్, ఒప్పొటాప్ టీమ్‌కు రూ.30 లక్షల బహుమతిరిజిస్ట్రేషన్లు ప్రారంభం.. 23 వరకు అందుబాటులోలెవెల్ 20కి పైన ఉన్న వారు పాల్గొనవచ్చుమార్చి 10న గ్రాండ్ ఫినాలే
పబ్‌జి గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లో ఇదొక హాటెస్ట్ సెన్సేషన్. ఈ గేమ్ యువతను కట్టి పడేస్తోంది. ఇప్పుడు పబ్‌జి గేమ్ ప్లేయర్లకు తీపి కబురు అందింది. పబ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 షెడ్యూల్ వెల్లడైంది. దీనికి ఒప్పొ స్పానర్‌ చేస్తోంది. పబ్‌జి మొబైల్ క్యాంపస్ చాంపియన్‌షిప్ 2018 విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఇప్పడు ఒప్పొ, టెన్‌సెంట్ కంపెనీలు పబ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019కు శ్రీకారం చుట్టాయి. గత చాంపియన్‌షిప్‌తో పోలిస్తే ప్రస్తుత టోర్నమెంట్‌లో రివార్డ్ మనీ రెట్టింపు అయ్యింది. టెన్‌సెంట్ గేమ్స్ తాజాగా ఒప్పొ పబ్‌జి మొబలై్ ఇండియా సిరీస్ 2019ను ప్రకటించింది. ఇదొక ఇ-స్పోర్ట్స్ టోర్నమెంట్. భారత్‌లోని పబ్‌జి గేమ్ ప్లేయర్లు అందరూ ఇందులో పాల్గొనవచ్చు. అయితే ప్లేయర్ లెవెల్ 20కి పైనుండాలి. ఈ పోటీలో గెలిచిన టీమ్‌లు రూ.కోటి బహుమతి లభిస్తుంది. ప్రైజ్ మనీలో నగదు, ఒప్పొ ఫోన్లు కలిసి ఉంటాయి. పబ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019 గ్రాండ్ ఫినాలే మార్చి 10న జరుగుతుంది. టాప్‌లో ఉన్న టీమ్‌కు రూ.30 లక్షల బహుమతి లభిస్తుంది. రెండో స్థానంలోని టీమ్ రూ.10 లక్షలు, మూడో స్థానంలోని టీమ్ రూ.5 లక్షలు గెలుచుకుంటాయి. వీరితోపాటు టాప్ 20లో మిగిలిన వారికి కూడా బహుమతులు ఉంటాయి. దీనికితోడు ఆయా కేటగిరిల్లో బెస్ట్ ప్లేయర్‌కు రూ.50,000 బహుమతి లభిస్తుంది. ఎంవీపీ, ఎక్స్‌టర్మినేటర్, రిడీమర్, లాంగ్ రేంజర్ వంటి పలు విభాగాలున్న విషయం తెలిసిందే.
టోర్నమెంట్‌ ఎలా ఉంటుంది?
పబ్‌బి మొబైల్ క్యాంపస్ చాంపియన్‌షిప్ 2018లో కేవలం విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండేది. అయితే ఇప్పడు పబ్‌జి మొబైల్ ఇండియా సిరీస్ 2019లో లెవెల్ 20పైన ఉన్నవారు ఎవరైనా పాల్గొనవచ్చు. గేమ్ వెబ్‌సైట్‌లోకి (http://www.pubgmobile.in) వెళ్లి రిజిస్టర్ నౌ పై క్లిక్ చేసి, ఫామ్‌ను నింపితే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్లేయర్ ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో మొత్తంగా నలుగురు సభ్యులుంటారు.
జనవరి 10 నుంచే రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. జనవరి 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గ్రాండ్ ఫినాలేకు ముందు క్వాలిఫయింగ్ రౌండ్స్ ఉంటాయి. తొలిగా ఇన్ గేమ్ క్వాలిఫయర్ రౌండ్ ఉంటుంది. ఇందులో టీమ్‌లు జనవరి 21 నుంచి 28 వరకు మొత్తం 15 క్లాసిక్ మ్యాచ్‌లు ఆడాలి. ఇన్ గేమ్ క్వాలిఫయర్ రౌండ్‌లో టాప్‌లోని 2,000 టీమ్‌లను తొలి రౌండ్ కింద 100 గ్రూప్‌లుగా విభజిస్తారు. అంటే ప్రతి గ్రూప్‌లో 20 టీమ్‌లు ఉంటాయి. తర్వాత ప్రతి గ్రూప్‌లోని టాప్ నాలుగు టీమ్‌లు రెండో రౌండ్‌లోకి వెళ్తాయి.
రెండో రౌండ్‌ విషయానికి వస్తే.. ఇందులో తొలి రౌండ్‌లోని టాప్ 400 టీమ్‌లను 20 గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లోని టాప్ 4 టీమ్‌లు మూడో రౌండ్‌లోకి వెళ్తాయి. మూడో రౌండ్‌లో టాప్ 80 టీమ్‌లను 4 గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లో 20 టీమ్‌లు ఉంటాయి. ఇవి నాకౌట్ మ్యాచ్‌లు ఆడతాయి. ప్రతి గ్రూప్‌లోని టాప్ 5 టీమ్‌లు గ్రాండ్ ఫినాలేకు వెళ్తాయి. టాప్ 20 టీమ్‌లు గ్రాండ్ ఫినాలేలో పోటీపడతాయి. గ్రాండ్ ఫినాలే మార్చి 10న ఉంటుంది. ప్లేయర్లు అందరూ లెటెస్ట్ వెర్షన్ గేమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos