‘చంద్ర’ పతనం ఖాయం

‘చంద్ర’ పతనం ఖాయం

హైదరాబాద్‌: వచ్చే
విధానసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
మట్టి కరవటం ఖాయమని  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.శనివారం
ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.  దిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా ఆయన చక్రం తిరగదని వ్యాఖ్యానించారు. వైకాపా గెలిచి
తీరుతుందని నమ్మకంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో  
వ్యాపారులు, పరిశ్రమల యజమానులపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరిగితే చంద్రబాబు
ఎందుకు కలత చెందుతారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆస్తులుంటే వైకాపాలో చేరాలని చెబుతున్నామా? గత ఐదేళ్లలో ప్రజలకు చేసిన
మేలు ఏమిటో వెల్లడించాలని చంద్రబాబును డిమాండు చేసారు.   తెలంగాణలో ఐదు విధానపరిషత్తు  స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని భరోసా వ్యక్తీకరించారు. బరిలోకి
దిగాలో వద్దో  కాంగ్రెస్సే తేల్చుకోవాలన్నారు.  తెలంగాణలో పదహారు లోక్‌సభ
స్థానాల్లో  తెరాస అభ్యర్థులు గెలిచి
తీరుతారని దీమాగా అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌, భాజపా రెండింటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత
ఆధిక్యత లభించే వాతావరణం లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos