లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు ఉత్తర ప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు చేశారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రవాదులిద్దరు జమ్ము-కాశ్మీర్లోని కుల్గాంకు చెందిన షహనవాజ్ అహ్మద్, పుల్వామాకు చెందిన అక్విబ్ అహ్మద్గా గుర్తించారు. జమ్ము-కాశ్మీర్ పోలీసులతో వారి గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.